ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rammohan Naidu: ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో చంద్రబాబుకు సాటి లేరు

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:51 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.

Union Minister Rammohan naidu

శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu)కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.

Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?


ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయ లబ్దికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు విసుగుచెంది బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియాలో సహాయ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని... అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని... కేంద్రం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు


కాగా.. భారీ వర్షాలతో ఏపీ ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ వాసులను వరద ముంచెత్తింది. గత వారం రోజులుగా ప్రజలు జలదిగ్బంధంలోనే ఉండిపోయారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డే వన్ నుంచి సహాయక చర్యలపై పర్యవేక్షణ చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలపై ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీశారు. వరద బాధితుల కోసం అహర్నిశలు శ్రమించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు తానున్నాంటూ భరోసా ఇచ్చారు. తాను పరిగెడుతూ.. అధికారులను కూడా పరిగెత్తించారు సీఎం చంద్రబాబు.


ఇవి కూడా చదవండి...

AP News: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి

పెరిగిన బుడమేరు వరద.. భయాందోళనలో బెజవాడ వాసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 12:05 PM

Advertising
Advertising