ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Vs YSRCP: గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. కొడాలి నాని పరిస్థితేంటి..!?

ABN, Publish Date - Aug 11 , 2024 | 11:34 AM

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..

కృష్ణా జిల్లా: వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. సీన్ కట్ చేస్తే.. ఐదంటే ఐదేళ్లలో టీడీపీ కూటమి (NDA Alliance) అధికారంలోకి రావడంతో నాడు ఓవరాక్షన్ చేసి విర్రవీగిన ఒక్కొక్కరి తాట తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది..! ఒక్కొ ఘటన గుర్తుకు తెచ్చుకుని మరీ.. పాత విషయాలన్నీ బయటికి తీసి వైసీపీ నేతలకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయటి తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది..!. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టార్గెట్‌గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఏం జరిగింది..!?

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడుల, పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటికి బయటికి తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు, స్థానిక నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును ఎంతలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా.. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనరాదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారు. ఆఖరికి.. డిసెంబర్-25, 2022లో టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా ‘మాకేమీ పట్టదు’ అన్నట్లుగా పూర్తిగా వైసీపీ నేతలకే సీఐ గోవిందరాజులు అండ్ కో కొమ్ముకాశారు.


ఇప్పుడు టీడీపీ వంతు!

నాడు వైసీపీ అధికారంలో ఉండగా మా వంతు అని విర్రవీగిన నేతలకు.. ఇప్పుడిక కూటమి వంతు వచ్చేసరికి వరుసబెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. గన్నవరంలో దాడి తాలుకూ వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై వైసీపీ నేతలు మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌లతో పాటు మరో ఇరవై మందిపై 143,144,146,188,427,506 R/W 149 BNS కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు.. కే కన్వెన్షన్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైనా పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగిన అందరికీ తెలిసిందే. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. కొడాలి నాని టార్గెట్‌గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. తాజా రెండు కేసులతో బెజవాడ వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - Aug 11 , 2024 | 11:50 AM

Advertising
Advertising
<