ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gidugu Rudraraju: ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల పర్యటిస్తున్నారు

ABN, Publish Date - Jan 22 , 2024 | 09:47 PM

కాంగ్రెస్ బలోపేతానికి ఏపీలో షర్మిల పర్యటిస్తున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) అన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేరుకున్నారు.

విశాఖపట్నం: ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారని.. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) అన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం నాడు షర్మిల చేరుకున్నారు. షర్మిలకు గిడుగు రుద్రరాజు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం నుంచి షర్మిల పర్యటనను ప్రారంభిస్తారని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి‌లో ఈ పర్యటన జరుగుతుందని గిడుగు రుద్రరాజు తెలిపారు.

అనంతరం ఈ నెల 30వ తేదీన కడపలోని ఇడుపులపాయ వద్ద మొదటి విడత పర్యటన ముగుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ను సంస్థగతంగా పార్టీ స్థితిగతులను తెలుసుకోవడానికి షర్మిల ఈ పర్యటన చేస్తున్నారని అన్నారు. ఈ పర్యటన కేవలం కాంగ్రెస్ అంతర్గత పర్యటన మాత్రమేనని.. ఇందులో సభలు, సమావేశాలు ఉండవని తెలిపారు. జిల్లాల్లో ఉన్న పార్టీ ప్రెసిడెంట్లు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులతో ప్రత్యేకంగా షర్మిల సమావేశం అవుతారని చెప్పారు. షర్మిలతో పాటు జనరల్ సెక్రెటరీ ఇన్‌చార్జి మాణిక్యాలరావు, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ పర్యటనలో పాల్గొంటారని గిడుగు రుద్రరాజు తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 10:41 PM

Advertising
Advertising