ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andhra Pradesh: అన్నదాతకు శుభవార్త..!

ABN, Publish Date - May 16 , 2024 | 03:37 AM

అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం

Monsoon

విశాఖపట్నం, మే 15(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది.

ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షా లు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. 50ఏళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాల సీజన్‌లో సగటున 87 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 16 , 2024 | 07:39 AM

Advertising
Advertising