ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:49 AM

బొబ్బిలి పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా సోదాలు చేసిన పోలీసులు.. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నిందితులపై నిఘా పెట్టి వారి గదులను తనిఖీ చేశారు. రహస్యంగా దాచిన రెండు బాక్సుల్లో 4కేజీల బంగారు నగలను గుర్తించారు.

విజయనగరం: బొబ్బిలి పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా సోదాలు చేసిన పోలీసులు.. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నిందితులపై నిఘా పెట్టి వారి గదులను తనిఖీ చేశారు. రహస్యంగా దాచిన రెండు బాక్సుల్లో 4కేజీల బంగారు నగలను గుర్తించారు. పెద్దమెుత్తంలో బంగారం దొరకడంత పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.


నగలకు సంబంధించిన వివరాలు అడగ్గా నిందితుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. కనీసం రసీదులు కూడా లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నారంటూ వాటిని సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బాక్సుల్లో మెుత్తం 18రకాల ఆభరణాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అందులో నల్లపూసల హారాలు, ఉంగరాలు, లాకెట్స్ వంటివి ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఇద్దరు నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. పట్టణంలో ఈస్థాయిలో నగలు పట్టుపడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated Date - Aug 03 , 2024 | 08:49 AM

Advertising
Advertising
<