YCP Minister: అన్ని వర్గాలు బాగుపడాలంటే.. జగన్ మళ్లీ సీఎం కావాలి
ABN , Publish Date - Jan 04 , 2024 | 07:55 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం రాష్ట్రానికి అవసరమని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. పేదలకు మంచి జరగాలంటే.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న జగన్ మళ్లీ సీఎం కావాలని, అన్ని వర్గాలు బాగుపడాలంటే...జగన్ మళ్లీ సీఎం కావాలని మంత్రి తెలిపారు.

విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ గెలవడం రాష్ట్రానికి అవసరమని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. పేదలకు మంచి జరగాలంటే.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న జగన్ మళ్లీ సీఎం కావాలని, అన్ని వర్గాలు బాగుపడాలంటే...జగన్ మళ్లీ సీఎం కావాలని మంత్రి తెలిపారు.
"నేను, అమర్ నాధ్ గెలవడం ముఖ్యం కాదు.. జగన్ గెలవాలి. మేము గెలస్తామని అంటేనే మాకు టికెట్లు ఇవ్వమని అన్నాం. ఎవరు గెలుస్తారో వారికే టికెట్లు ఇవ్వమని మేమే చెప్పాం. పేదలకు మంచి జరగాలంటే...సంక్షేమ పథకాలు కొనసాగాలన్న జగన్ మళ్లీ సీఎం కావాలి. అన్ని వర్గాలు బాగుపడాలంటే...జగన్ మళ్లీ సీఎం కావాలి. పేదలు, ధనికుల మధ్య చంద్రబాబు ఆధునిక అంటరానితానాన్ని ప్రోత్సహించారు. నారా భువనేశ్వరి తిరిగితే ఏమిస్తుంది?. ఎన్నికలు వస్తున్నాయని కాబట్టే ఆమె వచ్చారు. టీడీపీ హయాంలో మత్స్యకారులకు న్యాయం జరగలేదు. కేవలం జగన్ హయాంలోనే న్యాయం జరిగింది." అని మంత్రి అప్పలరాజు అన్నారు.