ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:02 PM

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.

hybrid cars

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. దీంతో అనేక మంది ఈ మోడల్లో వచ్చిన కార్లు, జీపులు సహా ఇతర వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.


మార్కెట్ డిమాండ్

యోగి ప్రభుత్వం జులై 5న 'స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లపై(hybrid cars)' 100% రోడ్డు పన్నును రద్దు(road tax ban) చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో కంపెనీలు, కొనుగోలుదారులు లాభపడతారు. ఈ నేపథ్యంలో ఈ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత మూడు నెలల్లో లక్నోలో 850 హైబ్రిడ్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీలో హైబ్రిడ్ వాహనాలపై రోడ్డు పన్ను వసూలు చేయకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే రోడ్డు పన్ను మినహాయింపు ఉంది.


ట్యాక్స్ ఫ్రీ

ఈ క్రమంలో మారుతీ, హోండా సిటీ, మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ సహా హైబ్రిడ్ కార్ల ఇతర వాహన కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. ఈ కార్లను కొనుగోలు చేస్తే కనీసం రూ.1.5 నుంచి 2 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో యూపీలో హైబ్రిడ్‌ కార్ల విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా బెంగళూరు, తెలంగాణ(telangana)లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఢిల్లీ(delhi) సహా పలు ప్రాంతాల్లో కూడా ఈ వాహనాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించాలని అక్కడి మార్కెట్ వర్గాలు, స్థానికులు కోరుతున్నారు.

భారతదేశంలో అతిపెద్ద కార్ మార్కెట్లలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఒకటి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌లో 10% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఉత్తర ప్రదేశ్‌లో 2,36,097 యూనిట్ల రిటైల్ అమ్మకాలు జరిగాయి. ఇది జనవరి-జూన్ 2023లో 2,08,092 యూనిట్ల కంటే 13.46% ఎక్కువ.


ఇది కూడా చదవండి:

Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..


Anant Ambani-Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి కోసం ముంబై చేరుకున్న.. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ సహా..

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 12 , 2024 | 12:43 PM

Advertising
Advertising
<