ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బాలిక హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పోర్న్ వీడియోలకు బానిసై..

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:32 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో..

Miyapur Police Solve Vasantha Case

తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య (Miyapur Child Case) కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోర్న్ వీడియోలకు బానిసై కన్నకూతురిపైనే తండ్రి కన్నేశాడని, కోరిక తీర్చాలంటూ ఆ బాలికపై ఒత్తిడి తెచ్చాడని తేలింది. అందుకు కూతురు నిరాకరించి, తల్లికి విషయం చెప్తానని అరవడంతో.. బాలికను హతమార్చినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు

మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట్ గ్రామంలోని లక్ష్మణ్ తండాకు చెందిన నరేష్ దంపతులు కొన్ని రోజుల క్రితం బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చారు. ఈ దంపతులకు వసంత (12) అనే కుమార్తె ఉంది. కట్ చేస్తే.. వసంత ఒకరోజు అనుకోకుండా మిస్ అయ్యింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో.. నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు తప్పిపోయిందని, ఆమెని వెతికి పెట్టాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసుని దర్యాప్తు చేశారు. వారం రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రే తన కూతురిని హతమార్చినట్లు తెలిసి.. పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది.


Read Also: మ్యాగీ మ్యాన్ అంటూ రోహిత్ శర్మపై ట్రోల్స్

ఎందుకు చంపావంటూ నరేష్‌ని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతను అసలు నిజం కక్కేశాడు. పోర్న్ వీడియోలకు బానిసైన నరేష్.. కూతురిపై కన్నేశాడు. తన కోరిక తీర్చమంటూ బలవంతం చేయబోయాడు. అందుకు నిరాకరించిన వసంత.. తల్లికి చెప్తానని గట్టిగా అరిచింది. దీంతో.. కోపంతో నరేష్ కన్నకూతురినే చంపేశాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి.. నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ ప్రదేశంలోనే మృతదేహాన్ని వదిలేశాడు. తన కూతురు చనిపోయిందా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం ఆ ప్రదేశానికి నిందితుడు మరోసారి వెళ్లాడు. వరుసగా మూడుసార్లు అక్కడికి వెళ్లొచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుని ఛేధించిన పోలీసులు.. నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. తన భర్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి.. నరేష్ భార్య హతాశురాలైంది.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 04:32 PM

Advertising
Advertising