ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:15 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

బెంగళూరు, సెప్టెంబర్ 28: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

Also Read: Mumbai: నగరానికి పొంచి ఉన్న ముప్పు.. అప్రమత్తమైన పోలీసులు


ఈ ఆరోపణల కారణంగా జ్జానదికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: PM Modi: నేడు జమ్మూకు ప్రధాని మోదీ


దాంతో ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. అందులోభాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ఈడీ ఉన్నతాధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కతీల్, విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

For National News And Telugu News..

Updated Date - Sep 28 , 2024 | 11:31 AM