ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతిని 30 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో దాచి

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:12 AM

బెంగళూరు వయ్యాలికావల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు.

బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): బెంగళూరు వయ్యాలికావల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ ఇంట్లో యువతిని హత్యచేసి 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పదిరోజులకు ముందే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి పేరు మహాలక్ష్మి అని సెంట్రల్‌ విభాగం ఏసీపీ సతీశ్‌ వెల్లడించారు. వేరే రాష్ట్రానికి చెందిన ఆమె ఇక్కడే స్థిరపడ్డారని, భర్తకు దూరమయ్యారని తెలిపారు. ఇంట్లో ఆమె ఒక్కరే నివసిస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా ఆమె ఇంటినుంచి దుర్వాసన వస్తుండడంతో అదే భవనంలో నివసించేవారు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. యువతి అక్క, తల్లి ఇంటికి వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. ఫ్రిజ్‌ను తెరిచి చూసి హత్య జరిగినట్లు గుర్తించారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆమెను పికప్‌, డ్రాప్‌ చేసేందుకు ఓ యువకుడు వచ్చేవాడని, అతడే దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.

Updated Date - Sep 22 , 2024 | 03:12 AM