ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ABN, Publish Date - Jul 01 , 2024 | 07:05 PM

మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, జులై 01: మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేత పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు.

Also Read: AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ

అలాంటి పదవిని తొలిసారిగా చేపట్టిన రాహుల్ గాంధీ ఇటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అగ్నివీరుల పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. అగ్నివీరులను వాడుకొని వదిలేసే కార్మికులగా ఆయన అభివర్ణించారన్నారు. అలాగే ఈ పథకంలో చేరిన వారిలో.. ఒకరు పెన్షన్ అందుకుంటారు. మరొకరు అందుకొరంటూ ఆయన విమర్శలు చేశారని గుర్తు చేశారు. అంతేకాదు జవాన్ల మధ్య విభజన సృష్టిస్తున్నారంటూ రాహుల్ పేర్కొన్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.

Also Read: Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?


Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

అయితే అగ్నివీరుల పథకంపై సభలో కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ఇలా విమర్శలు గుప్పించిందన్నారు. వారి విమర్శలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి పలుమార్లు సరైన సమాధానమిచ్చారన్నారు. అయినా రాజ్యాంగ పదవులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హితవు పలికారు.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

ఇక ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మొత్తం హిందూ సమాజం హింసాత్మకమైనదే కాకుండా అసత్యమైనదన్నట్లు వ్యాఖ్యానించారని ఆయన వివరించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలతో.. తన ప్రతిపక్ష హోదా స్థాయిని తగ్గించారన్నారు. రాహుల్ ఈ తరహా ప్రకటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 07:07 PM

Advertising
Advertising