ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvaneshwar : ఇక బీజేపీకి మద్దతివ్వం: బీజేడీ

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:36 AM

బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పష్టంచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

భువనేశ్వర్‌, జూన్‌ 24: బీజేపీకి ఇక మద్దతిచ్చే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్పష్టంచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని 21 ఎంపీ స్థానాలకు గాను ఒక్కటీ గెలవలేకపోయింది. అయితే రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరితో నవీన్‌ సోమవారమిక్కడ సమావేశమయ్యారు. ఎగువ సభలో గట్టి ప్రతిపక్షంగా మారాలని వారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తాలని సూచించారు. భేటీ తర్వాత రాజ్యసభలో బీజేడీ నేత సస్మిత్‌ పాత్రా విలేకరులతో మాట్లాడారు. గతంలో బీజేపీకి అంశాలవారీగా మద్దతిచ్చామని.. ఈసారి మాత్రమే పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jun 25 , 2024 | 03:37 AM

Advertising
Advertising