ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pooja Khedkar: వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్..

ABN, Publish Date - Aug 01 , 2024 | 06:00 PM

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు(Pooja Khedkar) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్‌ను భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.

Controversial IAS trainee Pooja Khedkar

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు(Pooja Khedkar) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పూజా ఖేద్కర్‌ను భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఈమెకు UPSCకి చెందిన వారు ఎవరైనా సాయం చేశారా అనే విషయాలను కూడా ఆరా తీయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతోపాటు నకిలీ సర్టిఫికేట్‌లను ఉపయోగించి ఇతర అభ్యర్థులెవరైనా రిజర్వేషన్‌ను అన్యాయంగా పొందారా అనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని కోర్టు తెలిపింది.


నకిలీ గుర్తింపు

మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తన వైకల్యాల గురించి అబద్ధం చెప్పి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో నకిలీ గుర్తింపును తయారు చేయించుకుంది. ఈ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వివాదాస్పద ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్ ఎంపికను UPSC రద్దు చేసింది. UPSC ప్రకారం పూజా ఖేద్కర్ తన ఎంపిక కోసం వివిధ స్థాయిలలో మోసం చేసింది. పూజ 2022 బ్యాచ్‌లో ఎంపికైంది. ఎంపిక సమయంలో ట్రైనీ ఐఏఎస్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, సంతకం, ఈమెయిల్, మొబైల్ నంబర్, చిరునామాను మార్చి నకిలీ ఐడీని తయారు చేసినట్లు కమిషన్ పేర్కొంది. కొత్త ఐడీ తెచ్చుకుని పరీక్షకు హాజరైంది.


వెలుగులోకి వివాదాలు

ఫేక్ ఐడీ ఆధారంగా యూపీఎస్సీ క్లియర్ చేసి ట్రైనీగా చేరిన తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ క్రమంలో పూజా రహస్యాలు బట్టబయలు కావడంతో ఆమెకు సమస్యలు వచ్చి పడ్డాయి. ఆమె ట్రైనీ ఐఎఎస్‌గా పని చేయడానికి వచ్చిన క్రమంలో ఆమె చర్యల కారణంగా వివాదాల్లో చిక్కుకుంది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతోపాటు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అన్ని సర్టిఫికేట్లు, ఇతర పత్రాలను ధృవీకరించాలని UPSC మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


పూజా ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలేంటి?

  • శిక్షణ సమయంలో కార్యాలయంలో ప్రభుత్వ వసతి, సిబ్బంది, వాహనం, ప్రత్యేక క్యాబిన్‌ కల్పించాలని పూజా ఖేద్కర్‌ డిమాండ్ చేసింది

  • ఆమె తన వ్యక్తిగత ఆడి కారుపై ఎరుపు, నీలం లైట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ లోగోను అమర్చడం ద్వారా హక్కులను దుర్వినియోగం చేయడం

  • దొంగతనం ఆరోపణలపై అరెస్టయిన ట్రాన్స్‌పోర్టర్‌ను విడుదల చేయాలని పూజా ఖేద్కర్ డీసీపీ ర్యాంక్ అధికారిపై ఒత్తిడి తెచ్చారు.

  • ఐఏఎస్‌ కావడానికి నకిలీ సర్టిఫికెట్‌ను వాడుకున్నట్లు ఆరోపణలు, ఆమె UPSC ఫారమ్‌లో తనను తాను OBC నాన్ క్రీమీ లేయర్ అని ప్రకటించుకుంది

  • పూజా ఖేద్కర్‌ కుటుంబం ఆస్తి కోట్లలో ఉందని, ఆమె స్వయంగా దాదాపు 17 కోట్లకు యజమాని అని ఆరోపణ కూడా ఉంది

  • పూజా ఖేద్కర్ వైకల్యం కేటగిరీ కింద UPSC ఫారమ్‌ను పూరించారు. ఆమె 40% దృష్టి లోపం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. వైద్య పరీక్షల కోసం పిలిచినప్పుడు ఆమె ఎప్పుడూ రాలేదు

  • ఎంబీబీఎస్ కాలేజీలో అడ్మిషన్ సమయంలో కూడా పూజా పత్రాలను తారుమారు చేసింది. 2011 లేదా 2012లో మెడికల్ కాలేజీలో చేరే సమయంలో అతని తండ్రి సర్వీస్‌లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

Fastag: నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్‌ ట్యాగ్ కొత్త రూల్స్.. కేవైసీ అప్‌డేట్ చేశారా..


Bangalore: వయనాడ్‌లో వర్షబీభత్సం.. కావేరి తీర జిల్లాల్లో అలర్ట్‌!


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 06:05 PM

Advertising
Advertising
<