ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం..

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:33 PM

ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మథురలోని మహావాన్ పరిధిలోని జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మథురలోని మహావాన్ పరిధిలోని జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. 40 మందితో వెళ్తున్న బిహార్ నుంచి దిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. అగ్నికీలక ధాటికి 5గురు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న మథుర ఎస్పీ శైలేష్ దూబే.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి తక్షణ విచారణకు ఆదేశించారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందంచారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాగా.. గతంలోనూ యమునా ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. 87వ మైలు రాయి వద్ద వేగంగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 12:33 PM

Advertising
Advertising