Share News

Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

ABN , Publish Date - Sep 25 , 2024 | 09:57 AM

జమ్మూ కశ్మీర్‌‌‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఈ విడతలో రాష్ట్రంలో ఆరు జిల్లాలోని మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌‌‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఈ విడతలో రాష్ట్రంలో ఆరు జిల్లాలోని మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనాతోపాటు జమ్మూ కశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రాలు సైతం ఉన్నారు.

Also Read: Muhammad Yunus: షేక్ హసీనా ఆరోపణలు.. యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌తో యూనస్ భేటీ


ఈ ఎన్నికల్లో దాదాపు 2.5 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా మొత్తం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6.00 గంటలకు ముగియనుంది. ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు.

Also Read: Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి రేటు మాత్రం..


మరోవైపు ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీతో కాంగ్రెస్ పార్టీ జత కట్టింది. అలాగే బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 20 మంది, బీజేపీ 17 మంది, కాంగ్రెస్ పార్టీ ఆరుగురిని బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో 170 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు.


మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌కు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన తొలి విడత ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్ నమోదయింది. మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి. ‌


దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అదీకూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనే విషయం తెలియాలంటే.. అక్టోబర్ 8వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 10:08 AM