Share News

కర్ణాటక సీఎం సిద్దూపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:23 AM

ముడా వివాదంలో నిండా మునిగిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు మరో షాక్‌ తగిలింది.

కర్ణాటక సీఎం సిద్దూపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

బెంగళూరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ముడా వివాదంలో నిండా మునిగిన కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు మరో షాక్‌ తగిలింది. అర్కావతి లే అవుట్‌లో ఇంటి స్థలాల పంపిణీలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ గవర్నర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఎం సిద్దరామయ్య, బీడీఏ కమిషనర్‌, బీడీఏ అధికారులకు వ్యతిరేకంగా అర్కావతి లే అవుట్‌ లబ్ధిదారులు శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య, రాజశేఖర్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లే అవుట్‌లో కేటాయించిన భూములు భూకబ్జాదారులపాలవుతున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ముడా వివాదంలో స్నేహమయి కృష్ణ లోకాయుక్త అధికారులకు సోమవారం మరింత సమాచారం ఇచ్చారు.

Updated Date - Oct 15 , 2024 | 04:23 AM