ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ADR Report: లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు.. ఏడీఆర్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు

ABN, Publish Date - May 23 , 2024 | 08:05 PM

లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకు చదివారు.

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకు చదివారు.

647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది అభ్యర్థులు తాము 12వ తరగతి ఉత్తీర్ణులయ్యామని, 1,502 మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించుకున్నారు.


డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. మొదటి దశ ఎన్నికలలో 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5, 12వ తరగతులని చెప్పగా.. 836 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. 26 మంది నిరక్షరాస్యులని చెప్పారు.

నలుగురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. రెండో దశలో 533 మంది అభ్యర్థులు తమ విద్యా స్థాయిలు 5,12వ తరగతుల మధ్య ఉన్నాయని ప్రకటించగా, 574 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదివామని వెల్లడించారు. దాదాపు 37 మంది అక్షరాస్యులమని, ఎనిమిది మంది నిరక్షరాస్యులని చెప్పగా ముగ్గురు తమ విద్యార్హతలను అందించలేదు. ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 08:05 PM

Advertising
Advertising