ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai : ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి.. ఏపీకి చెందిన ఇద్దరు యువకుల అరెస్ట్‌

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:56 AM

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.

ముంబై, జూలై 14: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో అతిరిథ మహారథుల మధ్య అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన ఈ వేడుకల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ వాసులు ఆహ్వానం లేకుండా పాల్గొనేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు.

నిందితుల్లో ఒకరిని యూట్యూబర్‌ వెంకటేశ్‌ (26)గా, మరొకరిని వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న షేక్‌ మహ్మద్‌ షఫీ (28)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ఏపీ నుంచి ముంబై వచ్చారని, ఆహ్వానం లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.

జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వారిని భద్రతా సిబ్బంది అడ్డగించి పోలీసులకు అప్పగించారు. దీంతో వారిని బీకేసీ పోలీ్‌సస్టేషన్‌కు తరలించి వారిపై కేసులు నమోదు చేశారు.

Updated Date - Jul 15 , 2024 | 03:56 AM

Advertising
Advertising
<