ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha Speaker Post: లోక్ సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే..! ఇండియా కూటమి మద్దతు ఎవరికంటే

ABN, Publish Date - Jun 25 , 2024 | 11:36 AM

మోదీ 2.0 హయాంలో లోక్‌సభలో స్పీకర్‌గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ: మోదీ 2.0 హయాంలో లోక్‌సభలో స్పీకర్‌గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓంబిర్లా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజులతో భేటీ అయ్యారు.

దీంతో మరోసారి లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఎన్డీయే నేతలు ఓంబిర్లా పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.


12 గంటల్లోపు స్పీకర్ పదవికి నామినేషన్ వేయాలని లోక్ సభ నోటిఫికేషన్ జారీ చేసింది. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు ఉండగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. కొంతమంది స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు కానీ ఎన్డీయే కూటమికి సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది.

అయితే ఓంబిర్లాను స్పీకర్‌గా కొనసాగించే అంశంపై ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపే అవకాశం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుకూలంగా లేరని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు పట్టుబడుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 12:24 PM

Advertising
Advertising