ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Speaker Khader : ఏమైంది నీకు.. మతి చెడిందా?

ABN, Publish Date - Jul 21 , 2024 | 05:51 AM

కర్ణాటకలో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలపై శాసనసభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌.. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి అంశాలను ప్రస్తావించారు.

  • కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్‌పై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం

బెంగళూరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలపై శాసనసభలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌.. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి అంశాలను ప్రస్తావించారు. ఒకానొక దశలో ఆవేశానికి లోనై ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా కేకలు వేస్తూ ఊగిపోయారు. స్పీకర్‌ యూటీ ఖాదర్‌ నాలుగైదుసార్లు జోక్యం చేసుకుని అలా మాట్లాడరాదని హితవు పలికారు.

అయినా ప్రదీప్‌ వినకపోవడంతో తీవ్రంగా మందలించారు. ‘నీకు ఏమైంది, మతి చెడిందా..? ఎవరైనా అతని చేతిలో ఇనుప ముక్క పెట్టండి’ (మూర్ఛ వచ్చిన వారికి ఇచ్చిన తరహాలో) అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా పట్టించుకోని ప్రదీప్‌ ఈశ్వర్‌ అలా మాట్లాడుతూనే ఉన్నారు. చీఫ్‌ విప్‌ అక్కడికి వెళ్లి నమస్కరించి మాట్లాడవద్దని సూచించారు. ఆ తర్వాత ఐటీబీటీల శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే జోక్యం చేసుకొని ప్రదీ్‌పను శాంతపర్చారు.

Updated Date - Jul 21 , 2024 | 05:51 AM

Advertising
Advertising
<