Share News

Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..

ABN , Publish Date - May 09 , 2024 | 04:27 AM

లోక్‌సభ ఐదో దశ ఎన్నికలలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది.

Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..

న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఐదో దశ ఎన్నికలలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ స్థానాలకు ఐదో దశలో మే 20న ఎన్నికలు జరుగనున్నాయి. తొలుత 749 మంది అభ్యర్థుల నామినేషన్లను ఈసీ ఆమోదించింది.

అయితే, పలువురు అభ్యర్థుల నామినేషన్ల విత్‌డ్రా తర్వాత తుదిపోరులో 695 మంది అభ్యర్థులున్నారని పేర్కొంది. ఐదో దశలో అత్యధికంగా యూపీలో 14, మహారాష్ట్రలో 13 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమబెంగాల్‌(7), ఒడిశా, బిహార్‌(5), జార్ఖండ్‌(3), జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది.

Updated Date - May 09 , 2024 | 04:27 AM