ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భర్త దీర్ఘాయుష్షుకు వ్రతం చేసి.. రాత్రికి అన్నంలో విషంపెట్టి చంపిన భార్య!

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:00 AM

భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది.

లఖ్‌నవూ, అక్టోబరు 21: భర్త దీర్ఘాయుష్షు కోసం నిష్ఠగా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఆమె అదే రోజు రాత్రి భర్తను హత్యచేసింది. తన వ్రతం కోసం ఉదయం నుంచి పొద్దంతా ఏర్పాట్లతో బిజీగా ఉన్న భర్తతో సాయంత్రం గొడవపడి, రాత్రి అతడికి భోజనంలో విషం పెట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. యూపీలోని కౌశంబీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇస్మాయిల్‌పూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన శైలేశ్‌. నిందితురాలు అతడి భార్య సవిత. ఆదివారం రోజంతా ఉపవాసం ఉన్న సవిత, సాయంత్రం వ్రతం పూర్తయ్యాక భర్తతో గొడవపడింది.

అయితే కొద్దిసేపటికే ఆ గొడవ సద్దుమణిగింది. రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేశారు. చేతులు కడుక్కున్న తర్వాత ఏదో పనిచేప్పి పొరుగింటికి వెళ్లి రావాలని భర్తను పురమాయించింది. కొద్దిసేపటికి అతడు అస్వస్థతకు గురై ఇంటికొచ్చేసరికి ఇంట్లోంచి పారిపోయింది. శైలేశ్‌ను అతడి సోదరుడు అఖిలేశ్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ శైలేశ్‌ మృతిచెందాడు. అంతకుముందు.. శైలేశ్‌ స్టేట్‌మెంట్‌ను వీడియో రూపంలో రికార్డు చేశారు. భోజనంలో భార్య తనకు విషం పెట్టిందని శైలేశ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

Updated Date - Oct 22 , 2024 | 04:00 AM