ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

USA: అమెరికాలో కాల్పులు.. బాపట్ల జిల్లా యువకుడి మృతి

ABN, Publish Date - Jun 23 , 2024 | 12:38 PM

బాపట్ల జిల్లా: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లాకు చెందిన యువ‌కుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందారు. ఆర్కెన్నాస్‌లోని సూపర్ మార్కెట్‍‌లో గోపి పనిచేస్తున్నాడు.

బాపట్ల జిల్లా: అమెరికా (America)లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు (Thug) జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), బాపట్ల జిల్లా (Bapatla Dist.)కు చెందిన యువ‌కుడు దాసరి గోపీకృష్ణ (32) (Dasari Gopi Krishna) మృతి చెందారు. ఆర్కెన్నాస్‌ (Archennas)లోని సూపర్ మార్కెట్‍‌ (Super Market)లో గోపి పనిచేస్తున్నాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం గోపీకృష్ణ కౌంట‌ర్‌లో ఉండ‌గా ఓ దుండ‌గుడు అకస్మాత్తుగా లోపలకు వ‌చ్చి తుపాకీతో అత‌నిపై కాల్పులు జ‌రిపిన అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. మృతుడు స్వస్థలం బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం, యాజలిగా గుర్తించారు.


గోపీకృష్ణ జీవ‌నోపాది కోసం ఎనిమిది నెల‌ల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్నాస్‌ రాష్ట్రంలోని సూప‌ర్ మార్కెట్‌లో ప‌ని చేస్తున్నారు. ఈ స‌మాచారం తెలియ‌డంతో గోపీకృష్ణ కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. దీంతో గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆర్కెన్నాస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jun 23 , 2024 | 12:38 PM

Advertising
Advertising