CM Revanth Reddy: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Mar 07 , 2024 | 12:57 PM
మహబూబ్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాలమూరు పర్యటనకు వచ్చారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కోస్గిలో పర్యటించారు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాలమూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎంను శాలువ కప్పి సన్మానిస్తున్న దృశ్యం.

మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం. ప్రక్కన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి.

మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానం ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తదితరులు..

ప్రజా ఆశీర్వాద సభ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తున్న పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి..

మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానం ప్రజా ఆశీర్వాద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులు..

పాలమూరు ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు..
Updated at - Mar 25 , 2024 | 06:48 PM