ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పెళ్లయినా భర్తను దగ్గరకు రానివ్వని భార్య.. 12 రోజుల తర్వాత విచారించగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

ABN, Publish Date - May 28 , 2024 | 09:43 PM

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పరిచయాలు సులభంగా అవుతున్నాయి. అలాగే మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రేమ, పెళ్లి పేరుతో నిత్యం అనేక మంది మోసపోవడం చూస్తున్నాం. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పరిచయాలు సులభంగా అవుతున్నాయి. అలాగే మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రేమ, పెళ్లి పేరుతో నిత్యం అనేక మంది మోసపోవడం చూస్తున్నాం. తాజాగా, ఇండోనేషియాలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయినా ఆమె తన భర్తను దగ్గరకు రానివ్వలేదు. అయితే 12 రోజుల తర్వాత విచారించడగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన వ్యక్తికి 2023లో అడిండా కంజా అనే మహిళను సోషల్ మీడియాలో పరిచయమైంది. అప్పటినుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. కొన్నాల్లు ఫోన్లలో మాట్లాడుకున్న తర్వాత ఓ రోజు డైరెక్ట్‌గా కలిశారు. అయితే ఆ సమయంలో ఆమె ముసుగు ధరించి ఉంది. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పింది. అలాగే తమ సాంప్రదాయం ప్రకారం ముసుగు తీయనని చెప్పింది. మొఖం చూపించకపోయినా అతను కూడా బలవంతం చేయలేదు.

Viral Video: మేడపై మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన పులి.. చివరకు జరిగిందేంటంటే..


ఇలా ఆమె అతడితో తరచూ ముసుగుతోనే కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఇద్దరూ స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదిలావుండగా, వివాహ తర్వత కూడా ఆమె ముసుగు తేసేందుకు ఒప్పుకోలేదు. దీనికితోడు శారీరకంగా కలిసేందుకూ అంగీకరించలేదు. బలవంతం చేసినప్పుడల్లా అనారోగ్యంగా ఉందంటూ సాకులు చెబుతూ వచ్చింది. వివాహమైన 12 రోజులు ఇలా చెబుతూ వచ్చింది. దీంతో భర్తకు అనుమానం వచ్చి.. భార్య గురించి విచారించాడు. దీంతో చివరకు అతడికి షాకింగ్ వాస్తవాలు తెలిశాయి.

Viral Video: ఇలాంటి రైలు ప్రయాణం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీళ్ల నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


అసలు ఆమె మహిళే కాదని తెలియడంతో అతను షాక్ అయ్యాడు. దీనికితోడు తన భార్యకు తల్లిదండ్రులు ఉన్నారని, 2020 నుంచి మహిళల తరహాలో డ్రెస్సులు ధరిస్తున్నాడని తెలిసింది. మేకప్ వేయడంతో అతను కాస్త ఆమెలా కనిపించడంతో పాటూ గొంతు కూడా మహిళల తరహాలోనే ఉండేది. దీంతో చాలా మంది ఆమె మహిళే అని నమ్మేవారు. చాలా మందిని ఇలాగే మోసం చేసిందని, ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా ఆస్తులు కాజేయడానికే వివాహం చేసుకుందని పోలీసు విచారణలో తేలింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రేమికుల గొడవ.. చివరకు ప్రియురాలు చేసిన పనికి అంతా షాక్..

Updated Date - May 28 , 2024 | 09:44 PM

Advertising
Advertising