ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG Tea Break: తడబడుతున్న టీమిండియా.. ఇంగ్లండ్ స్పిన్ దెబ్బకు టాపార్డర్ విఫలం

ABN, Publish Date - Feb 24 , 2024 | 02:38 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 131/4గా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది.

రాంచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. 130 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 131/4గా ఉంది. ప్రస్తుతం భారత జట్టు ఇంకా 222 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్(54), సర్ఫరాజ్ ఖాన్(1) ఉన్నారు. టీమిండియా టాపార్డర్ విఫలమైంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను అండర్సన్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. దీంతో 4 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో జైస్వాల్, గిల్ కలిసి రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. కానీ స్పిన్నర్ షోయబ్ బషీర్ టీమిండియాను దెబ్బకొట్టాడు. వరుస విరామాల్లో 3 కీలక వికెట్లు తీశాడు. గిల్, జైస్వాల్ భాగస్వామ్యాన్ని 25వ ఓవర్‌లో విడదీశాడు. 38 పరుగులు చేసిన గిల్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రజత్ పటీదార్(17)ను కూడా లెగ్‌బైస్‌లో ఔట్ చేశాడు. 2 సిక్సులతో మంచి టచ్‌లో కనిపించిన జడేజా(12)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 44 పరుగుల వ్యవధిలోనే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.


కాగా అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. 302/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఒలీ రాబిన్సన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాబిన్సన్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. 103వ ఓవర్ నుంచి టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా చెలరేగాడు. రాబిన్సన్(58)ను ఔట్ చేసి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. రూట్, రాబిన్సన్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఆ తర్వాత షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్‌ను డకౌట్ చేశాడు. దీంతో 6 పరుగుల వ్యవధిలో ఇంగ్లీష్ జట్టు తమ చివరి 3 వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేసిన రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 02:49 PM

Advertising
Advertising