ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Bangladesh: భారత్‌, బంగ్లా టెస్టులో మూడో రోజు గేమ్ అప్‌డేట్..మొదలవుతుందా

ABN, Publish Date - Sep 29 , 2024 | 10:38 AM

ఈరోజు కూడా కాన్పూర్ టెస్టులో మూడో రోజు మ్యాచ్ ఆలస్యంగా మొదలు కానుంది. అంపైర్లు ఉదయం 10 గంటలకు తనిఖీ చేసి కీలక విషయాన్ని వెల్లడించారు.

day 3 india vs bangladesh 2nd test

భారత్(team india), బంగ్లాదేశ్(bangladesh) మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండోది, చివరి మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతోంది. వర్షం కారణంగా రెండో రోజు మ్యాచ్‌ రద్దయింది. ఇప్పుడు మ్యాచ్ మూడో రోజైన ఆదివారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మ్యాచ్ ప్రారంభం అయ్యే వరకు మనం ఇంకా వేచి ఉండాల్సిందే. ఎందుకంటే గ్రౌండ్ చాలా తడిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం క్రికెట్ ఆడటం సాధ్యం కాదని అంపైర్లు అన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు గ్రౌండ్ తనిఖీ చేయనున్నారు. అంపైర్లు మైదానంలో 10 గంటలకు తనిఖీ చేశారు. భవిష్యత్తు పరిస్థితులపై చర్చిస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ కష్టపడి పనిచేస్తున్నారు.


గేమ్ ఛేంజర్

కానీ వర్షం కారణంగా మళ్లీ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మమినుల్ హక్ 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 81 బంతులు ఎదుర్కొన్న అతను 7 ఫోర్లు కొట్టాడు. ముష్ఫికర్ రహీమ్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 31 పరుగుల వద్ద నజ్ముల్ హుస్సేన్ ఔటయ్యాడు. 57 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు బాదాడు. 24 పరుగుల వద్ద షాద్‌మన్ ఔటయ్యాడు. ఆకాశ్ దీప్ ఇప్పటి వరకు టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్ అని నిరూపించుకున్నాడు. 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతోపాటు 2 మెయిడిన్ ఓవర్లు వేశాడు.


హోటల్‌కు ఆటగాళ్లు

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 9 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో 22 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. తొలి రోజు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కానీ ఇప్పుడు గేమ్ తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుందా లేదా అనేది ప్రశ్నర్థకంగా మారింది. కాన్పూర్ టెస్టు రెండో రోజైన వర్షం కారణంగా శనివారం ఒక్క బంతి కూడా వేయలేకపోయారు. రోజంతా అడపాదడపా వర్షం కురిసింది. ఆ క్రమంలో ఆట రద్దు కాకముందే టీమిండియా ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లిపోయారు. మూడో రోజు కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అందువల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడవచ్చు.


ఇరు జట్ల ప్లేయర్లు

భారత జట్టు ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

బంగ్లాదేశ్ జట్టు ప్లేయింగ్ 11లో షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Utility News: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ చేస్తే నిమిషాల్లోనే సూపర్‌ఫాస్ట్‌..

Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..


Read More Sports News and Latest Telugu News

Updated Date - Sep 29 , 2024 | 10:43 AM