Share News

దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 06:16 AM

దసరా సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా 1,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా 1,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11 వరకు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు నడుస్తాయని ఏపీఎస్‌ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కిషోర్‌నాథ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేస్తామన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 06:17 AM