ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Peddapalli: దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలి

ABN, Publish Date - May 17 , 2024 | 03:27 AM

దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

దొడ్డు రకం వడ్లకూ బోనస్‌ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కోరుట్ల నియోజకవర్గంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి, మంథని, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు.


మంచిర్యాల, చెన్నూరులో బీఆర్‌ఎస్‌ నాయకులు రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నిరసనలు చేపట్టారు. భువనగిరి జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురంలో బీఆర్‌ఎస్‌ నేతలు నిరసన చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలంలోని గట్టేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి, తాండూరు మండలంలోని చెంగోల్‌ కొనుగోలు కేంద్రం వద్ద రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేటలోని రైతు సహకార సంఘం ముందు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.


అన్ని రకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలి

అన్ని రకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. సన్న ధాన్యానికే బోనస్‌ చెల్లిస్తారన్న వార్తలతో ఇతర రకాల ధాన్యాన్ని సాగు చేసే రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్‌ చెల్లిస్తామన్న హామీ ఏమైందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్‌ నిలదీశారు. సన్న ధాన్యానికే బోనస్‌ అంటూ రైతులను కాంగ్రెస్‌ సర్కారు మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - May 17 , 2024 | 03:27 AM

Advertising
Advertising