ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సాయం చేయండి..

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:09 AM

సీఎం రేవంత్‌ శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

హైదరాబా‌ద్: సీఎం రేవంత్‌ శుక్రవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వాటిల్లిన వరద నష్టం తీవ్రతను సీఎం రేవంత్‌.. శివరాజ్‌కు వివరించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. కానీ, వరద నష్టం తీవ్రంగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించినట్లు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.


  • తీవ్ర నష్టం

రాష్ట్రంలో అంచనాలకు మించి వర్షం కురవడంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, వంతెనలు, ఇళ్లు చాలాచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని సీఎం రేవంత్‌ తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాలో వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్‌ కింద మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు కూడా తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు.


  • నిబంధనలు సడలించండి..

కేంద్రం నుంచి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను సడలించాలని సీఎం రేవంత్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో 50 శాతం ఉపయోగిస్తే.. ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌) నిధులు వాడుకునేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేదన్నారు. ఇప్పుడు వంద శాతం ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే, శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారని తెలిపారు. ఈ నిబంధనను సడలించి, గతంలో మాదిరిగానే ఉంచాలని కోరారు. అదేవిధంగా వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్‌ రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు రూ.60కోట్లు అవసరమవుతాయని, కానీ ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు.


  • ఏపీకి ఇచ్చినట్లులాగే మాకూ ఇవ్వండి

సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టంపైనా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీకి అందించినట్లుగానే తెలంగాణకూ సాయం చేయాలని సీఎం రేవంత్‌ కేంద్ర మంత్రిని కోరారు. స్పందించిన కేంద్రమంత్రి శివరాజ్‌.. విపత్తులు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందన్నారు. వరదలతో వాటిల్లిన నష్టం, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తెలిపేలా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు తిలకించారు.


  • ఒకే వేదికపై రేవంత్‌, సంజయ్‌

కేంద్రమంత్రి చౌహాన్‌తో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజకీయంగా నిత్యం మాటాల తూటాలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడే రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ ఒకే వేదికపై కూర్చున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా అధికారిక హోదాలో సంజయ్‌ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated Date - Sep 07 , 2024 | 04:09 AM

Advertising
Advertising