ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సీఎం అమెరికా పర్యటన తెలంగాణ మార్పునకు నాంది: యెన్నం

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:42 AM

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది.

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 14: ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది. ఈ పర్యటనలో ఉన్న నాకూ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులపై పూర్తి విశ్వాసం ఏర్పడింది’’ అని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


సీఎం పర్యటనలో రోజంతా వివిధ కంపెనీల సీఈవోలతో తెలంగాణలో పెట్టుబడుల విషయమై చర్చలు జరిపారన్నారు. గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన సందర్భంగా తెలంగాణలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకుంటే.. తాజా పర్యటనలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకున్నారని ఆయన వివరించారు.

Updated Date - Aug 15 , 2024 | 01:42 AM

Advertising
Advertising
<