Share News

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:30 AM

బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

  • బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల

  • అధ్యాపకురాలికి అరుదైన గౌరవం

బేగంపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని అందజేసే ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 16మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయురాలుగా మృదుల నిలిచారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె.. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈనెల 5న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోనున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన డాక్టర్‌ మృదులకు ప్రిన్సిపాల్‌ డా.కె.పద్మావతి, బోధనాసిబ్బంది అభినందనలు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 04:30 AM