ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Warangal: తండ్రి దుక్కి దున్నుతుండగా.. రోటవేటర్లో పడి కొడుకు మృతి

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:00 AM

ట్రాక్టర్‌ రోటవేటర్‌తో తండ్రి దుక్కి దున్నుతుండగా.. సరదాగా ట్రాక్టర్‌ ఇంజన్‌ పైకి ఎక్కిన కుమారుడు ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం లైన్‌తండాలో సోమవారం జరిగింది. లైన్‌తండాకు చెందిన గుగులోతు మశోద, రాజులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

  • వరంగల్‌ జిల్లా లైన్‌తండాలో విషాదం

నల్లబెల్లి, జూన్‌ 10: ట్రాక్టర్‌ రోటవేటర్‌తో తండ్రి దుక్కి దున్నుతుండగా.. సరదాగా ట్రాక్టర్‌ ఇంజన్‌ పైకి ఎక్కిన కుమారుడు ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం లైన్‌తండాలో సోమవారం జరిగింది. లైన్‌తండాకు చెందిన గుగులోతు మశోద, రాజులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సోమవారం రాజు ట్రాక్టర్‌ ఇంజన్‌కు రోటవేటర్‌ను తగిలించుకొని తన భూమిలో దుక్కి దున్నుతున్నాడు. అక్కడికి వచ్చిన అతని చిన్న కుమారుడు గుగులోతు బాలు(9), సరదాగా ట్రాక్టర్‌ ఎక్కాడు. దుక్కి దున్నతున్న సమయంలో ట్రాక్టర్‌ కుదుపులకు లోనై బాలు రోటవేటర్లో పడిపోయాడు.


వెంటనే ట్రాక్టర్‌ను ఆపినా, అప్పటికే శరీరం రెండు ముక్కలైంది. ఘటన స్థలికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి తల్లి మశోద ఫిర్యాదు మేరకు ఎస్సై రామారావు కేసు నమోదు చేశారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:00 AM

Advertising
Advertising