ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chegunta: పక్క రాష్ట్ర సీఎం ప్రజల్లో .. రేవంత్‌ ఇంట్లో: హరీశ్‌

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:37 AM

ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో ప్రజల్లో తిరుగుతుంటే, 54 ఏళ్ల రేవంత్‌ ఇంట్లో పడుకున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

చేగుంట, హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో ప్రజల్లో తిరుగుతుంటే, 54 ఏళ్ల రేవంత్‌ ఇంట్లో పడుకున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వరదలతో అతలాకుతలమై ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఆలస్యంగా మొద్దు నిద్రలేచి సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.


వరదల కారణంగా 16 మంది చనిపోయారని, తమకున్న సమాచారం ప్రకారం 31 మందికి పైగా చనిపోయి ఉంటారని తెలిపారు. వరదల్లో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమయ్యాయన్నారు. సోషల్‌ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై బీజేపీ చేస్తున్న అనుచితదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 03:37 AM

Advertising
Advertising