ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: హైదరాబాద్‌లో వార్‌ వన్‌సైడ్‌..

ABN, Publish Date - Jun 05 , 2024 | 09:06 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న మైనార్టీలు హైదరాబాద్‌(Hyderabad) లోక్‌సభ స్థానం పరిధిలో వార్‌ వన్‌సైడ్‌ చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు ఒకటి, రెండు శాతం మినహా పూర్తిగా మజ్లిస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారు.

- మిగతా రెండు స్థానాల్లో ప్రభావం చూపని మైనార్టీలు

- ఒక్క నాంపల్లిలోనే కాంగ్రెస్‏కు మొగ్గు చూపిన ఓటర్లు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న మైనార్టీలు హైదరాబాద్‌(Hyderabad) లోక్‌సభ స్థానం పరిధిలో వార్‌ వన్‌సైడ్‌ చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు ఒకటి, రెండు శాతం మినహా పూర్తిగా మజ్లిస్‌ పార్టీకి మద్దతుగా నిలిచారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌(Malkajigiri, Secunderabad) లోక్‌సభ స్థానాల్లో మాత్రం అలా ప్రభావం చూపలేదు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో గెలుపోటములను ప్రభావితం చేయడంలో కీలకమైన మైనార్టీల ఓట్లు చీలాయి. ఒక్క నాంపల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు చీలడంతో ఆ ఓట్లపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్‏కు భారీ దెబ్బపడింది.

ఇదికూడా చదవండి: Hyderabad: సినిమా షూటింగ్‌లు లేక.. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఏం చేశాడో తెలిస్తే..


సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 21.11 లక్షల ఓటర్లు ఉండగా, అందులో దాదాపుగా 4 లక్షల నుంచి 6 లక్షల వరకు మైనార్టీ ఓటర్లుంటారు. ఈ నియోజకవర్గం పరిధిలో నాంపల్లి, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ (ఏడు నియోజకవర్గాలు) ఉన్నాయి. ఇందులో అన్నిచోట్లా మైనార్టీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లే దాదాపు 80 శాతానికి పైగా ఉంటారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌లో మైనార్టీ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో క్రిస్టియన్‌ ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. వారిపై బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. అయితే మైనార్టీల ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి గాకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు చీలాయి. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కాంగ్రెస్‌ లక్షకు పైగా ఓట్లు సాధించింది. బీజేపీ కంటే అత్యధికంగా 62వేల ఓట్లకు పైగా మెజార్టీ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు వచ్చిన కానీ గెలుపు సాధించలేకపోయారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 09:07 AM

Advertising
Advertising