ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: కేసీఆర్‌కు పని తనం తప్ప.. పగతనo తెలియదు

ABN, Publish Date - Jan 09 , 2024 | 05:52 PM

మాజీ సీఎం కేసీఆర్‌( KCR ) కు పని తనం తప్ప పగతనo తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌( KCR ) కు పని తనం తప్ప పగతనo తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయని మండిపడ్డారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైళ్లలో ఉండే వారని చెప్పారు. కాంగ్రెస్ అన్నిటికీ వంద రోజుల డెడ్ లైన్ పెడుతోందని ఎద్దేవా చేశారు. వంద రోజుల తర్వాత ప్రజలే కాంగ్రెస్‌పై చీటింగ్ కేసులు పెడతారన్నారు. ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటీ టీడీపీ కాంగ్రెస్, ఇంకోటి ఒరిజినల్ కాంగ్రెస్ అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.

Updated Date - Jan 09 , 2024 | 05:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising