Share News

Nalgonda: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:31 PM

కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో ఆయన శుక్రవారం మాట్లాడారు.

Nalgonda: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ : కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు తమ సర్కార్ కట్టుబడి ఉందని.. తప్పకుండా వాటిని నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతామన్నారు.

మిర్యాలగూడలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. "నిర్బంధ పాలన నుంచి ప్రజాపాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శివరాత్రి రోజు సీనియర్ నేత రఘువీర్‌కి ఎంపీ టికెట్ కేటాయించడం ఆనందానిచ్చింది. రావి నారాయణ రెడ్డి మెజారిటీ రికార్డును రఘువీర్ రెడ్డి తిరగరాయాలి. కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా లోక్ సభ ఎన్నికల్లో పోరాడాలి" అని వెంకటరెడ్డి అన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 09:32 PM