ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యాయం గెలిచింది: కేటీఆర్‌

ABN, Publish Date - Aug 28 , 2024 | 04:48 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

  • బండి వ్యాఖ్య కోర్టు ధిక్కరణే అని ధ్వజం

  • సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు: కేటీఆర్‌

  • బండి సంజయ్‌ పోస్ట్‌పై అభ్యంతరం

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఊరట లభించింది, న్యాయం గెలిచింది అని సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అదే సమయంలో కవిత బెయిల్‌ అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన పోస్ట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇంత చవకబారుగా మాట్లాడతారా ? అంటూ దుయ్యబట్టారు. దురుద్దేశంతో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా పరిగణించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 28 , 2024 | 04:48 AM

Advertising
Advertising
<