ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Elections: అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ABN, Publish Date - Jun 07 , 2024 | 06:44 PM

తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఫలితం (By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నల్గొండ: తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఫలితం (By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna), బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉన్నారు.


స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52మంది ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ ఇంకా మందకొడిగానే సాగుతోంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 15 గంటల్లో కేవలం 3,309 ఓట్లేనే కౌంటింగ్ చేసినట్లు తెలుస్తోంది రెండో ప్రాధాన్యత ఓట్లలో విజేత కోటా కోసం సుమారు 43 వేల ఓట్లు. లెక్కించాల్సి ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మరో 10 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రౌండ్ రౌండ్‌కు అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.


అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో ప్రాథాన్యంతో కలిసి 18,962ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. మెుత్తం గెలవడానికి కావాల్సిన కోటా ఓట్లు 1,55,095. తీన్మార్ మల్లన్న గెలిచేందుకు ఇంకా 31,885ఓట్లు రావాలి. రాకేశ్ రెడ్డి గెలిచేందుకు 50,581ఓట్లు కావాలి. రెండో ప్రాధాన్యతలో కాంగ్రెస్‌కు 397ఓట్లు రాగా.. బీఆర్ఎస్‌కు 266 వచ్చాయి. ఇంకా ఫలితం తేలకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 44 మందిని అభ్యర్థులను ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు.


ఇప్పటివరకు ఎవరికి ఎన్ని ఓట్లంటే..

కాంగ్రెస్: 1,23,873.

బీఆర్ఎస్: 1,04,990.

బీజేపీ: 43,797.

స్వతంత్ర (అశోక్): 29,948

గెలుపు కోటాకు −31,222 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్థి

గెలుపు కోటాకు 50105 ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్ధి

Updated Date - Jun 07 , 2024 | 06:50 PM

Advertising
Advertising