ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:49 PM

Telangana: ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీ నే అని చెప్పుకొచ్చారు.

MP Raghunandan RAo

వికారాబాద్, సెప్టెంబర్ 10: ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీ నే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.

Narayana: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన



తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో బీజేపీకి కూడా అన్నే సీట్లు వచ్చాయన్నారు. వికారాబాద్ జిల్లా గురించి గతంలో ఉన్న నాయకులు అనేక మాటలు మాట్లాడారని.. అభివృద్ధి మాత్రం చేయలేదని విమర్శించారు. హైడ్రా గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రని మండిపడ్డారు. ‘‘నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతా’’ అని ఎంపీ స్పష్టం చేశారు.

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..


రాహుల్‌పై కామెంట్స్

‘‘తెలుగు భాష గురించి అమెరికాలో మాట్లాడుతుంటాడు... ఈయనకు ఎలాగో మాట్లాడడంరాదు ... ఎవడు రాసిచ్చిండోనని చూస్తే శాంపిట్రోడో అనేటోడు రాసించిండు. దేశాన్ని పాలించిన తాతకు తెలియదు... ఇప్పుడున్న మానవుడికి ఈ దేశం గురించి తెలియదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోడీ గురించి దేశ విచ్చినాన్ని కోరుకునే వారు రాసిస్తే రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. రాహుల్ గాంధీకి పెళ్లయిందని ఓ పత్రిక రాస్తే దాన్ని కూడా తల్లి సోనియా గాంధీ ఖండించలే. రాహుల్‌పై తప్పుడు వార్తలతో నాతోటి ఎంపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తుండని బీజేపీ నాయకుడు కేసు వేసిన పరిస్థితి’’ అంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ గెలిస్తే నే ఈ దేశం క్షేమంగా ఉంటుందని.. అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

Viral Video: వామ్మో.. పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 10 , 2024 | 01:53 PM

Advertising
Advertising