ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

ABN, Publish Date - May 14 , 2024 | 03:00 AM

తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన... మీడియాతో మాట్లాడారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒకటే. నా అనే వారికి ఎప్పుడూ మద్దతు ఇస్తా. మావయ్య పవన్‌ విషయంలోనైనా, మిత్రుడు శిల్పా రవిరెడ్డి విషయంలో అయినా. భవిష్యత్తులోనూ నా అనే వారికి ఇలానే మద్దతిస్తా.

శిల్పా రవి నాకు 15ఏళ్లుగా మిత్రుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్‌ చేస్తానని మాటిచ్చా. 2019లో శిల్పా రవి రాజకీయాల్లోకి వచ్చినా.. కలవలేకపోయాను. అందుకే ఈసారి వెళ్లి కలిశా. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు’ అని అన్నారు. కాగా, శనివారం అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహరెడ్డితో కలసి నంద్యాలలో పర్యటించారు. పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్‌ అమలులో ఉన్నప్పుడు ఆయన పర్యటించడంతో.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను అల్లు అర్జున్‌, శిల్పా రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - May 14 , 2024 | 03:00 AM

Advertising
Advertising