ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GST Scam: 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు.. మాజీ సీఎస్‌ సోమేశ్‌పై కేసు

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:55 AM

వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు.. మరో ఇద్దరు ఉన్నతాధికారులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం.

  • ఇద్దరు వాణిజ్యపన్నుల అధికారులపైనా..

  • ఎఫ్‌ఐఆర్‌లో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

  • జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ తయారీ కంపెనీలు కూడా

  • 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్‌పుట్‌ క్రెడిట్స్‌

  • ఫిర్యాదు చేసిన కమిషనర్‌ రవి.. కేసు నమోదు

  • ఫిబ్రవరిలోనే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

  • అప్పట్లోనే అధికారులపై సోమేశ్‌ ఒత్తిడి!

  • విచారణ నిలిపివేతకు యత్నాలు.. సీఎస్‌గా

  • ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పన్నుల శాఖ

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు.. మరో ఇద్దరు ఉన్నతాధికారులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం. 70 కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడడమే కాకుండా.. ఐజీఎస్టీ కింద రూ.1000 కోట్ల మేర అక్రమంగా ఇన్‌పుట్‌ క్రెడిట్‌ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ విచారణలో అంతర్గతంగా తేలడంతో.. ఆ శాఖ కమిషనర్‌ కె.రవి మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(డీడీ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 406, 409, 120బీ, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 65 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఏ5గా సోమేశ్‌కుమార్‌ ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు, జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీ్‌సను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.


  • ఏమిటీ కుంభకోణం?

సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం, వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50ు పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్‌ ఇన్వాయి్‌సలను సృష్టించారు. ప్రధానంగా 18ు ట్యాక్స్‌ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్ర్కాప్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయి్‌సలలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు. కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలోని ఒక డీలరు పంజాబ్‌కు స్ర్కాప్‌ను పంపించినట్లు ఇన్వాయి్‌సలు తయారు చేశాడు. పంజాబ్‌ వ్యాపారి ఆ ఇన్వాయి్‌సలను ఆధారంగా చేసుకుని 18ు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జీఎస్టీ కౌన్సిల్‌ ఖాతాల నుంచి క్లెయిమ్‌ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్‌ డీలరు, తెలంగాణ డీలరు పంచుకున్నారు. ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కుని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ రూ.1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. ఈ కుంభకోణం జరిగిన తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ఫిబ్రవరి 22న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.


  • ఇలా కొల్లగొట్టారు..

జీఎస్టీలో పన్ను ఎగవేతలు, బకాయిలు వంటివాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ ఓ ప్రైవేటు సంస్థతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో కీలకమైన మాడ్యుల్‌ లేకపోవడం వెనకా.. పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన ఇద్దరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు వాణిజ్యపన్నుల కమిషనరేట్‌ అప్పట్లోనే గుర్తించింది. సాధారణంగా డీలర్లు తాము అమ్మిన వస్తువులకు ‘జీఎస్టీఆర్‌-1’ రిటర్నులు, ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు, చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి ‘జీఎస్టీఆర్‌-3బీ’ రిటర్నులను ఫైల్‌ చేయాలి. వస్తువులను కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు జీఎస్టీఆర్‌-1తో పాటు ‘జీఎస్టీఆర్‌-2ఏ’ రిటర్నులను సమర్పించాలి. దీని ద్వారా ఎంత విలువైన వస్తువులను కొనుగోలు చేశారన్నది తేలుతుంది. వస్తువులు అమ్మిన డీలరు జీఎస్టీఆర్‌-3బీని సమర్పిస్తేనే వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ.. ఇక్కడి డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాల డీలర్లకు అమ్మినట్లు జీఎస్టీఆర్‌-1 రిటర్నులను మాత్రమే ఫైల్‌ చేశారు. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వస్తువులను కొనుగోలు చేసినట్లు జీఎస్టీఆర్‌-2తో పాటు జీఎస్టీఆర్‌-3బీని ఫైల్‌ చేశారు. దాంతో వారికి ఐటీసీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఐటీసీని క్లెయిమ్‌ చేశారు. ఇలా రిటర్నులను ఫైల్‌ చేసినట్లు చూపారే తప్ప.. భౌతికంగా వస్తు సరఫరా జరగలేదు.


ఇక్కడి డీలర్లు జీఎస్టీఆర్‌-3బీని సమర్పించినట్లయితే ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లించాల్సి ఉండేది. అసలు వస్తు రవాణా జరగనప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ని క్లెయిమ్‌ చేయడానికే వస్తు సరఫరా జరిగినట్లు దొంగ ఇన్వాయి్‌సలను సృష్టించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీల ఐజీఎస్టీ సంబంధిత జీఎస్టీఆర్‌-3బీని సమర్పించారా? లేదా? అన్నది గుర్తించే ‘మాడ్యూల్‌’ కమిషనరేట్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లేనట్లు తేలింది. రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎ్‌సజీఎస్టీ), కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎస్టీ)ల రిటర్నులను గుర్తించే మాడ్యూల్స్‌ను మాత్రమే సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యూల్‌ను పొందుపర్చకపోవడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా? లేదా? అన్నదాన్ని సాఫ్ట్‌వేర్‌ గుర్తించడం లేదు.


పర్యవసానంగా దొంగ ఇన్వాయి్‌సలతో ఐటీసీని కొల్లగొట్టినట్లు తేలింది. ఫిబ్రవరిలో ఈ కుంభకోణం బయటపడగానే.. అంతర్గత విచారణలో సదరు సాఫ్ట్‌వేర్‌ సంస్థతో ఆ మాడ్యూల్‌ లేకుండా చూడాలంటూ సోమేశ్‌కుమార్‌తో పాటు కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాం ప్రసాద్‌ సూచించినట్లు తేలింది. దాంతో.. అప్పట్లోనే కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాంప్రసాద్‌కు మెమోలు జారీ చేశారు. కాగా.. ఫిబ్రవరి 22న ‘ఆంధ్రజ్యోతి’ ఈ కుంభకోణాన్ని వెలికితీయడంతో.. మాజీ సీఎస్‌ సోమేశ్‌ దీనిపై విచారణ జరపొద్దంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. సోమేశ్‌కుమార్‌ సీఎ్‌సగా ఉన్నప్పుడు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావడంతో.. అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు.

Updated Date - Jul 29 , 2024 | 02:55 AM

Advertising
Advertising
<