ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mulugu: కాటేసిన పాము, కరెంటు!

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:03 AM

పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు

  • పొలానికి వెళ్లి ఇద్దరు అన్నదాతల మృతి

  • ములుగు, సూర్యాపేట జిల్లాల్లో ఘటనలు

ములుగు, మద్దిరాల, అక్టోబరు 8: పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు భూతం కృష్ణ(25) డిగ్రీ పూర్తిచేసి జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తున్నాడు. సాగు చేసిన వరి కోతకు రావడంతో చూసుకునేందుకు మంగళవారం ఉదయం పొలానికి వెళ్లాడు. అయితే, బావి వద్ద మోటార్‌కు ఉన్న విద్యుత్‌ తీగలు నేలపై పడిపోవడంతో వాటిని పక్కన వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు.


మరో ఘటనలో... ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని అబ్బాపురం గ్రామానికి చెందిన సాయబోయిన సాంబయ్య(55) మంగళవారం మిర్చితోటలో గుంటుక కొడుతుండగా పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు సాంబయ్యను ములుగు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Updated Date - Oct 09 , 2024 | 04:03 AM