ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

ABN, Publish Date - Sep 24 , 2024 | 02:55 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.

Also Read:Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు

Also Read: Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

Also Read: Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..


మంగళవారం హైదరాబాద్‌లో వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలోనే ఉంటుందన్నారు. దాంతో ఈ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు నెలల్లో సీబీఐ విచారణను పూర్తి చేయాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Also Read: CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే

Also Read: Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..


శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో చేప నూనె, ఎద్దు కొవ్వు కలిపారని అంతా అంటున్నారన్నారు. ఇంత అపచారం నేను గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. తిరుమలలో భక్తులను స్వామి వారి దర్శనానికి పంపే విషయంలో అవినీతి జరిగిందంటే అనుకోవచ్చునని.. కానీ స్వామి వారి ప్రసాదం తయారీలో సైతం కరప్షనా? అని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

Also Read: R k Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్


గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం శాంతి హోమం నిర్వహించింది. ఆ తర్వాత శ్రీవారు కొలువు తీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో పూజారులు సంప్రోక్షణ నిర్వహించిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2024 | 03:24 PM