ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: రాఖీ కట్టేందుకు వెళుతూ.. మహిళ మృతి

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:23 AM

రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

ఖమ్మంక్రైం, ఆగస్టు 18: రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఖమ్మంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గాజుల మల్లమ్మ (58) సోమవారం రాఖీ పండుగ సందర్భంగా ఖమ్మంలో ఉండే తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆదివారం వచ్చింది.


ఈ క్రమంలో కొత్తబస్టాండ్‌లో బస్సు దిగి నడుచుకుంటూ వెళుతుండగా అతి వేగంగా వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి పది మీటర్ల దూరంలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. మహిళను ఢీకొట్టిన కారు ఆ తరువాత రోడ్డు పక్కనే ఉన్న రెండు స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్‌ పిల్లర్‌ను ఢీకొట్టి ఆగింది. కారులో ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో కారు నడుపుతున్న వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 03:23 AM

Advertising
Advertising
<