Share News

MP Bk ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బీకే

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:25 PM

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బీకే పార్థసారధి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రలో వైద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. మొబైల్‌ మెడికేర్‌ మిషనను ఎంపీ ప్రారంభించారు.

MP Bk ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బీకే
మాట్లాడుతున్న ఎంపీ

బత్తలపల్లి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బీకే పార్థసారధి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రలో వైద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. మొబైల్‌ మెడికేర్‌ మిషనను ఎంపీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య రథంలో నిపుణులైన వైద్యసిబ్బందితో మారుమూల గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆసియాలోనే తొలిసారిగా మొబైల్‌ మెడికేర్‌ మిషన ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహే్‌ష, నారాయణరెడ్డి,వీరనారప్ప, జక్కంపూటి నాగభూషణ, కోటిబాబు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:25 PM