Guntur: బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి
ABN, Publish Date - Apr 02 , 2025 | 03:36 AM
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి పెండ్యాల జ్యోతి బర్డ్ఫ్లూ (H5N1)తో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె గత నెలలో అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, పుణె ల్యాబ్ పరీక్షల్లో బర్డ్ఫ్లూ నిర్ధారణ అయింది

నరసరావుపేటలో నిర్ధారణ
వారం క్రితం చికిత్స పొందుతూ మృత్యువాత
నరసరావుపేట పట్టణంలో ఘటన
గుంటూరు మెడికల్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బర్డ్ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో బర్డ్ఫ్లూ (ఎవియన్ ఇన్ఫ్లూయెంజా/హెచ్5ఎన్1) మరణం నమోదైంది. పట్టణంలోని బాలయ్య నగర్కు చెందిన పెండ్యాల జ్యోతి అనే రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంగళవారం ధ్రువీకరించారు. గత నెలలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం మంగళగిరిలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఆ చిన్నారి అక్కడ చికిత్స పొందుతూ గత వారం ప్రాణాలు విడిచింది. అయితే బర్డ్ఫ్లూ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు చిన్నారి శాంపిల్స్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపారు. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణైనట్టు వైద్యాధికారులు తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి నిందితులకు కొత్త హార్డ్డి్స్కలు ఇచ్చినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కాపాటి శ్రీనివాస్ తెలిపారు. ఇక మీ ఇష్టమని న్యాయమూర్తి అన్నారు. కాగా.. దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. తమ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని.. పూర్తి స్థాయి వాదనలకు సమయం కేటాయించాలని కోరారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఎస్.గౌతమ్ వాదనలు వినిపిస్తూ.. దస్తగిరికి కడప కోర్టు ఇచ్చిన క్షమాభిక్ష కేసులో తాము ఇప్పటికే ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. అలాగే సీబీఐ కోర్టు సాక్షిగా గుర్తించిన కేసులోనూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ నెల 16న పూర్తి స్థాయి వాదనలు వింటామన్నారు. అలాగే హత్య కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సీజే ధర్మాసనానికి బదిలీ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 02 , 2025 | 03:53 AM