Share News

Amaravati: సొంతఇంటి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు భూమి పూజ

ABN , Publish Date - Apr 09 , 2025 | 09:59 AM

అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8.51 గంటలకు వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు.సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

Amaravati: సొంతఇంటి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు భూమి పూజ
CM Chandrababu Bhoomi Pooja

అమరావతి: రాజధాని ప్రాంతం అమరావతి (Amaravati), వెలగపూడి (Velagapudi)లో నూతన గృహానికి (New House) బుధవారం ఉదయం 8.51 గంటలకు భూమి పూజ (Bhoomi Pooja) జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari), మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు (Lokesh Family), తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు వారి చేత భూమి పూజ (Bhoomi Pooja) చేయించారు. సచివాలయం వెనుక ఈ6 (E6) రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

కాగా సీఎం చంద్రబాబు కుటుంబానికి పట్టువస్త్రాలు అందించాలని వెలగపూడి గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటికే పట్టు వస్త్రాలను రైతులు సిద్ధం చేశారు. రాజధాని మహిళ రైతులు రాత్రంతా శంకుస్థాపన ప్రాంతంలో రంగవల్లులతో తీర్చిదిద్దారు. చంద్రబాబు దంపతులకు స్వాగతం తెలిపే రంగవల్లులను మహిళా రైతులు వేశారు. భూమి పూజ జరిగే ప్రాంతంలో శంఖు, చక్రాలను తిరుణామాలను రంగవల్లులతో అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండి తీర్చిదిద్దారు. చంద్రబాబు కుటుంబం పట్ల తమ ఆప్యాయతను, అభిమానాన్ని చాటుకున్నారు. రాజధాని కోర్ ఏరియాలో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరుగుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబాలకు చెందిన 200 మంది వరకు హాజరయ్యారు.

Also Read..: సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి


అమరావతికి ఒక భరోసా..

తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులోభాగంగా ఇటీవల అమరావతిలో ఐదు ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అలాగే అదే సమయంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని రైతులు వివరించారు. ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని..ఉడతా భక్తి కింద ఆ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన భువనేశ్వరి..

2500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టనున్నారు. కార్యాలయం, నివాసంలోపాటు కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇంకోవైపు.. ఈ నిర్మాణ స్థలాన్ని ఇటీవల నారా భువనేశ్వరి సైతం పరిశీలించిన విషయం విదితమే. గతంలో 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇంటిని సైతం నిర్మించుకున్నారని ఆ పార్టీ నేతలు ఆర్కే రోజా, పేర్ని నాని తదితరులు ప్రకటించారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ఈ నిర్మాణాన్ని చేపట్టారని వివరించారు. అలా ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆ పార్టీ గెలిచుకొంది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


ఆ కొద్ది రోజులకే రాష్ట్రానికి మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం వందల రోజుల పాటు కొనసాగింది. ఇక 2024లో ఎన్నికల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు మొత్తం 164 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. అనంతరం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నా సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగపూర్ బయల్దేరిన చిరంజీవి దంపతులు ..

Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 09:59 AM