మెకానిక్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:22 AM
ఆటోమొబైల్ రంగంలో ఊహించని మార్పులు వస్తున్నాయని, మెకానిక్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ఆటోనగర్ మెకానిక్ల సంఘం అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు తెలిపారు.

మెకానిక్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
ఆటోనగర్ మెకానిక్ల సంఘం అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు
ఆటోనగర్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్ రంగంలో ఊహించని మార్పులు వస్తున్నాయని, మెకానిక్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని ఆటోనగర్ మెకానిక్ల సంఘం అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆటోనగర్లోని శ్రీవెంకటేశ్వర మెకానిక్ గ్యారేజీలో మోటారు ఇండియా మ్యాగజైన్, వాల్వోలైన్ ఇంజన్ ఆయిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాపినెస్ ట్రక్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వాహనాలు ఇంజన్లు బీఎస్ 6లో వస్తున్నాయన్నారు. కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు నాగమోతు రాజా మాట్లాడుతూ ఇటువంటి మీట్ల వల్ల మెకానిక్, డ్రైవర్లలో సమర్ధత, భద్రత వంటి అంశాలు మెరుగుపడుతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏటీఏ మాజీ కార్యదర్శి ఎం.ఎ ఖాలిక్, వి. రాఘవులు, మాధవ లూబ్రికెంట్స్ ప్రతినిధి మేకా రామ్లక్ష్మణకుమార్, వాల్వొలైన్ ఇంజన్ ఆయిల్స్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.