Share News

చౌక దుకాణాలపై అధికారుల దాడులు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:56 AM

నగరంలోని చౌకదు కాణాలపై విజిలెన్స, సివిల్‌ సప్లయ్‌ అధికారులు పలు ప్రాంతాల్లో గురువారం దాడులు నిర్వహించారు.

చౌక దుకాణాలపై అధికారుల దాడులు
చౌక దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): నగరంలోని చౌకదు కాణాలపై విజిలెన్స, సివిల్‌ సప్లయ్‌ అధికారులు పలు ప్రాంతాల్లో గురువారం దాడులు నిర్వహించారు. రేషనషాపు 53లో 3290 కేజీల బియ్యం, 604 కేజీల జొన్నలు, భౌతిక నిల్వల్లో తక్కువ ఉండటం, రేషనషాపు 162లో 1800 కేజీల బియ్యం, 286 ప్యాకెట్ల చక్కెర ఎక్కువ ఉండటంతో నిత్యావసర సరుకుల చట్టం 1955 సెక్షన 6ఏ కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజారఘువీర్‌, నగర సహాయ సరఫరాల అధికారి రామాంజనేయరెడ్డి, ఫుడ్‌ ఇన్సపెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, విజిలెన్స డిపార్టుమెంటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:56 AM